Nara Lokesh: ఈ దేశంలో తన ఇంటిపై జెండాను ఎగరేసుకున్న ఏకైక మంత్రి మన లోకేశ్: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • పోలీసుల గౌరవవందనం కూడా
  • అధికార దుర్వినియోగం అంటే ఇదే
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన విజయసాయి

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్న వేళ, లోకేశ్ తన నివాసంలో జెండా ఎగరవేయడాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమే. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని వందనం సమర్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటే ఇదే" అని ఆయన ట్వీట్ చేశారు. లోకేష్ సెల్యూట్, పోలీసుల గౌరవ వందనం సమర్పిస్తున్న ఫొటోలను విజయసాయి తన ఖాతాకు జతచేశారు.

More Telugu News