Jan Arogya Abhiyan: మోదీ ప్రకటించిన 'ఆరోగ్య అభియాన్' కార్యక్రమం ఎవరికి? ఎందుకు? ఉపయోగాలేంటి?

  • ప్రతి కుటుంబానికి 5 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్
  • 1,354 మెడికల్ మరియు సర్జికల్ ప్యాకేజీలను ఈ స్కీం కవర్ చేస్తుంది
  • 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 2000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఆరోగ్య అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. తొలి దశలో పైలట్ ప్రాజక్ట్ కింద చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయూ, నాగాలాండ్, మణిపూర్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్ లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ పాలసీ ఆధ్వర్యంలో అమలవుతుంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 29 ఈ పథకానికి అంగీకరించాయి. రానున్న కొన్ని నెలల్లో మరో 6 దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాయి. ఒడిశా మాత్రం ఈ పథకం తమకు వద్దని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ స్కీం లక్ష్యం ఏమిటి?
ప్రతి కటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల మేర క్యాష్ లెస్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడమే ఈ స్కీం లక్ష్యం. దేశ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల కుటుంబాలు ఈ పథకం కిందకు రానున్నాయి.

ఈ స్కీం అవసరం ఏమిటి?
ఒక అధ్యయనం ప్రకారం భారతీయులు తమ జేబు నుంచి ఆరోగ్యం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. కేవలం మెడికల్ ఖర్చుల వల్లే దాదాపు ఐదున్నర కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకున్నారు. వీరిలో 3.8 కోట్ల మంది ఆసుపత్రుల ఖర్చులు, మందుల కొనుగోళ్ల భారంతో పేదలుగా మారారు. ఇలాంటి కుటుంబాలనే ఈ స్కీం టార్గెట్ చేయబోతోంది.

ఈ స్కీం వేటిని కవర్ చేస్తుంది?
1,354 మెడికల్ మరియు సర్జికల్ ప్యాకేజీలను ఈ స్కీం కవర్ చేస్తుంది. వీటిలో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ (50 రకాల క్యాన్సర్లకు కీమోథెరపీ), కాలిన గాయాలు లాంటివి ఎన్నో ఈ స్కీం కిందకు వస్తాయి. అయితే లబ్దిదారులు సర్జికల్ మరియు మెడికల్ ప్యాకేజీలను ఒకేసారి వినియోగించుకోలేరు.

ఉపయోగాలు:
హాస్పిటల్ రిజిస్ట్రేషన్, నర్సింగ్, జనరల్ వార్డులో వసతి ఛార్జీలు భరించబడతాయి.
కన్సల్టేషన్ ఫీజ్, సర్జికల్ వస్తువులు, ఇప్లాంట్స్, మందులు, డయాగ్నస్టిక్ టెస్టులు, పేషెంట్లకు ఆహారం ఇవ్వబడతాయి. ప్రీ మరియు పోస్ట్ హాస్పిటర్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి.

ఒకటి కంటే ఎక్కువ సర్జరీలు జరిగినప్పుడు... మెదటి ట్రీట్ మెంట్ సందర్భంగా ఎక్కువ ఖర్చు అయినదాన్ని లెక్కించరు. రెండో ట్రీట్ మెంట్ లో 50 శాతం, మూడో ట్రీట్ మెంట్ లో 25 శాతం ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంలో ఈ పథకం అమల్లో ఉంటుంది.

ఈ స్కీం ఎలా అమల్లోకి వస్తుంది?
సెంట్రల్ లెవెల్: కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి సంబంధించి వెబ్ పోర్టల్ కూడా ఉంటుంది.

స్టేట్ లెవెల్: ఇన్స్యూరెన్స్ సంస్థలు, ఆసుపత్రులతో స్టేట్ హెల్త్ ఏజెన్సీలు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. ఆసుపత్రులకు అవసరమైన వసతులు, ఐటీ సేవలు ఉన్నాయో, లేదో స్టేట్ హెల్త్ ఏజెన్సీలే పర్యవేక్షిస్తాయి. లబ్దిదారులను గుర్తించడం, ఈ-కార్డులను ప్రింట్ చేయడం, సేవలను అందించడం వంటి బాధ్యత కూడా ఈ ఏజెన్సీలదే.

జిల్లా స్థాయి: రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్యూరెన్స్ సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకున్న 15 రోజుల్లోగా జిల్లాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమానికి చెందిన ఓ కమిటీ హాస్పిటళ్లను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత స్టేట్ హెల్త్ ఏజెన్సీ, ఇన్స్యూరెన్ సంస్థలు, హాస్పిటళ్ల మధ్య కాంట్రాక్ట్ కుదురుతుంది. ఈ పథకం కోసం 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 2000 కోట్లను కేటాయించింది.

ఏయే ఆసుపత్రులకు అర్హత లభిస్తుంది?
కనీసం 10 ఇన్ పేషెంట్ బెడ్స్ ఉండాలి. సరిపడా స్థలం, స్టాఫ్ ఉండాలి. సర్జరీలను నిర్వహించే ఆసుపత్రులకు కనీసం 15 బెడ్స్ ఉండాలి. ఇప్పటికే ఈ స్కీం కోసం దేశ వ్యాప్తంగా 7,826 ఆసుపత్రులు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిలో 47 శాతం ప్రైవేట్ ఆసుపత్రులే. 

More Telugu News