Narendra Modi: 2022 కల్లా భారతీయులను సొంతంగా అంతరిక్షంలోకి పంపుతాం!: మోదీ

  • అది యువకుడు లేదా యువతి కావొచ్చు
  • స్వాగతించిన ఇస్రో చైర్మన్ శివన్
  • సమయం తక్కువగా ఉన్నా పూర్తిచేస్తామని హామీ

72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. 2022 నాటికి సొంత రాకెట్, టెక్నాలజీతో భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. 2022 నాటికి దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తవుతాయనీ, అప్పటికల్లా భారతీయ యువతి లేదా యువకుడిని అంతరిక్షంలోకి పంపుతామని స్పష్టం చేశారు.

కాగా, ప్రధాని ప్రకటనను ఇస్రో చైర్మన్ కె.శివన్ స్వాగతించారు. తమకు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ వ్యోమగాములను జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే అవకాశముందని వ్యాఖ్యానించారు. రాబోయే 40 నెలల్లో ఈ ప్రాజెక్టు కోసం రూ.9,000 కోట్లు వెచ్చించనున్నట్లు శివన్ పేర్కొన్నారు. ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రామ్ లో భాగంగా సోవియట్ యూనియన్(ఇప్పటి రష్యా) 1984, ఏప్రిల్ 2న ప్రయోగించిన సూయజ్-టీ11 నౌక ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు.

More Telugu News