nithin: ఆడియన్స్ రెస్పాన్స్ ను కొత్త పద్ధతిలో సేకరించిన దిల్ రాజు

  • 15 సంవత్సరాల్లో 30 సినిమాలను తీశాను
  • ఎప్పుడూ ఇంత కన్ఫ్యూజన్ లేదు
  • ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు తీసుకెళతారు

దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో తెరకెక్కిన 'శ్రీనివాస కళ్యాణం' ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి అన్ని ఏరియాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని 'పార్క్ హయత్' హోటల్లో ఈ సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. "15 సంవత్సరాల్లో 30 సినిమాలను నిర్మించాను .. కానీ ఈ రోజు ఉన్నంత కన్ఫ్యూజన్ ఎప్పుడూ లేదు. 'శ్రీనివాస కళ్యాణం' ప్రివ్యూ చూసిన వాళ్లంతా ప్రశంసించారు .. దాంతో ఒక మంచి సినిమా చేశామని ఆనందించాం. సినిమా విడుదలైన తరువాత మిశ్రమ స్పందన ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

'' గురు .. శుక్రవారాల్లో తగ్గిన వసూళ్లు, శని .. ఆదివారాల్లో పెరిగాయి. కొంతమంది సినిమా బాగుంది అంటే .. మరికొంతమంది మరోలా చెబుతున్నారు. దాంతో మేం చేసింది తప్పా .. ఒప్పా అని ఆలోచించి, టైటిల్ తో కూడిన కార్డులను రెడీ చేయించాను. అందులో .. ఫరవాలేదు .. బాగుంది .. చాలా బాగుంది .. బాగోలేదు అనే అంశాలు ఉండేలా చూశాను. రెండు రాష్ట్రాలలో 60 .. 70 థియేటర్లకు ఈ కార్డులను పంపించి, 6 షోలకి సంబంధించిన ఆడియన్స్ అభిప్రాయాన్ని విశ్రాంతి సమయంలో ఆ కార్డుల ద్వారా తీసుకోమన్నాను. సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలతో పోలిస్తే .. ఈ రిపోర్ట్ బాగానే వుంది. మౌత్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News