Rahul Gandhi: పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం.. నారా బ్రాహ్మణి కూడా హాజరు!

  • హోటల్ తాజ్ కృష్ణాలో పారిశ్రామికవేత్తలతో రాహుల్ భేటీ
  • నారా బ్రాహ్మణికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన కాంగ్రెస్
  • యువ పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు స్వీకరించనున్న రాహుల్

హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో ఈ రోజు ఉదయం పారిశ్రామికవేత్తలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి లోకేశ్ సతీమణి, యువ మహిళా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి కూడా దీనికి హాజరయ్యారు. దాదాపు 200 మందికి పైగా తెలుగు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.  

ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న బ్రాహ్మణిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ, కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్లినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన సౌకర్యాలు, సదుపాయాలను కల్పిస్తారన్న అంశంపై మాట్లాడనున్న రాహుల్, వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు.

More Telugu News