nithin: 'శ్రీనివాస కళ్యాణం' నాలుగు రోజుల వసూళ్లు

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం'
  • వివాహం గొప్పతనాన్ని చాటే కథాకథనాలు
  • నితిన్ సరసన కథానాయికగా రాశి ఖన్నా

దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన 'శ్రీనివాస కళ్యాణం' .. ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. బంధాలు .. అనుబంధాలు .. వివాహ ప్రాముఖ్యత అనే అంశాలను కలుపుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించారు. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా 8.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ రోజు నుంచి కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరు చూపించవలసి వుంది. మరో రెండు రోజుల్లో 'గీత గోవిందం' థియేటర్లకు రానుంది. విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా విడుదల .. 'శ్రీనివాస కళ్యాణం' వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

More Telugu News