charan: చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • ఆ తరువాత ప్రాజెక్టు రాజమౌళితో 
  • వంశీ పైడిపల్లితో జరిగిన చర్చలు

ప్రస్తుతం చరణ్ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం చరణ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ .. రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత చరణ్ .. వంశీ పైడిపల్లిని లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇటీవల చర్చలు జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి మహేశ్ తో 'మహర్షి' చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత ఆయన చరణ్ తో చేయనున్న సినిమాకి సంబంధించిన పనులపై దృష్టి పెడతాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎవడు' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  

More Telugu News