Pv Sindhu: గత మూడు వారాల్లో కుదరలేదట... ఈ రోజు బోనమెత్తిన పీవీ సింధు!

  • స్వాగతం పలికిన మహంకాళి ఆలయ సిబ్బంది
  • ప్రత్యేక పూజలు చేసిన తెలుగుతేజం
  • వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల వల్ల రాలేకపోయానని వెల్లడి

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు బోనమెత్తింది. సికింద్రాబాద్ లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఈ ఉదయం బోనంతో పీవీ సింధు వచ్చింది. ఆమెకు స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది, అమ్మ దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేయించారు.

తాను ప్రతి సంవత్సరమూ అమ్మకు బోనం సమర్పిస్తానని, ఈ నెలలో తొలి మూడు వారాలూ తాను వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ సన్నాహాలు, పోటీల్లో పాల్గొంటూ ఉన్నానని, అందువల్ల పదిహేను రోజుల క్రితం బోనాల ఉత్సవాలకు తాను రాలేకపోయానని ఈ సందర్భంగా సింధూ పేర్కొంది. ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మను కోరుకున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా పీవీ సింధును చూసేందుకు స్థానికులు ఆసక్తిని చూపించడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. పలువురు సింధుతో సెల్ఫీలు దిగారు.

More Telugu News