aravindswami: మణిరత్నం సినిమాలో హీరోలంతా అన్నదమ్ములే!

  • తమిళంలో 'చక్క చివంత వానం'
  • తెలుగు టైటిల్ గా 'నవాబు'
  • సెప్టెంబర్ 28వ తేదీన విడుదల  

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చక్క చివంత వానం' సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అరవింద్ స్వామి .. శింబు .. విజయ్ సేతుపతి .. అరుణ్ విజయ్ .. జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోలంతా అన్నదమ్ములుగా కనిపించనున్నారు.

రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. బలమైన కథాకథనాలతో .. బంధాలు అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుందని అంటున్నారు. ప్రతి పాత్రను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దారనేది యూనిట్ సభ్యులమాట. ఈ నెలలో టీజర్ ను .. వచ్చే నెల ఆరంభంలో ట్రైలర్ ను రిలీజ్ చేసి, వచ్చే నెల 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.     

More Telugu News