tejaswi: సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల క్రితమే పరిచయం: బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి

  • సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు
  • ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటే పెళ్లితో ముడిపెడతారా?
  • సామ్రాట్ నాకు ఎప్పటికీ ఒక మంచి స్నేహితుడే

రియాల్టీ షో 'బిగ్ బాస్-2'కు బుల్లితెర ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ షో నుంచి తేజస్వి ఇప్పటికే ఎలిమినేట్ అయింది. అయితే, ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం సామ్రాట్ తో చాలా క్లోజ్ గా ఉంది. తేజస్వి ఎలిమినేట్ అయినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురైన సామ్రాట్... కంటతడి కూడా పెట్టాడు. దీంతో, ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా ఐ అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఓ మీడియాతో తేజస్వి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చేసింది.

'ఎనిమిదేళ్ల క్రితమే సామ్రాట్ నాకు పరిచయం. అప్పట్లో అంత క్లోజ్ గా ఉండేవాళ్లం కాదు. అతనికి పెళ్లయిందని, ఏదో సమస్య ఉందనే విషయం హౌస్ లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అందుకే అతనికి క్లోజ్ అయ్యా. దీంతో, నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ నే చంపేస్తున్నారు. కొందరు బూతులు కూడా పెడుతున్నారు. ఒక అబ్బాయితో ఎమోషనల్ గా అటాచ్ కావడంలో తప్పేం లేదు. నేను ఎవరితో స్నేహం చేయాలనే విషయాన్ని కూడా ట్రోలర్స్ డిసైడా చేస్తారా? ఈ ట్రోలింగ్ తో నేను చాలా బాధపడ్డా. కొందరేమో సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన పెళ్లితో ముడిపెడతారా? సామ్రాట్ నాకు ఎప్పటికీ మంచి ఫ్రెండే. ఈ విషయంలో నాకు మద్దతు పలుకుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు' అని తేజస్వి తెలిపింది. 

More Telugu News