nithin: భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన 'శ్రీనివాస కళ్యాణం'

  • మొన్ననే థియేటర్లకు వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం'
  • బలమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే సంగీతం

దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ నెల 9వ తేదీన 'శ్రీనివాస కళ్యాణం' థియేటర్లకు వచ్చింది. ఈ కుటుంబ కథా చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నితిన్ కెరియర్లో తొలి రోజున అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో 'శ్రీనివాస కళ్యాణం' రెండోస్థానంలో నిలిచిందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున ఈ సినిమా 5 కోట్లకి పైగా గ్రాస్ ను .. 3 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేయడం విశేషమని చెబుతున్నారు.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నైజామ్ ఏరియాలో స్వయంగా రిలీజ్ చేయగా, తొలి రోజునే 1.17 కోట్ల షేర్ ను వసూలు చేసింది. యూఎస్ లో తొలి రోజున ఈ సినిమా 20 లక్షలను రాబట్టింది. పెళ్లి సందడి ప్రధానంగా సాగే కథా కథనాలు .. భారీ తారాగణం .. మనసును తాకే పాటలు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీన 'గీత గోవిందం' విడుదల కానుండటంతో, ఆ లోగా 'శ్రీనివాస కళ్యాణం' మరిన్ని వసూళ్లను సాధించవలసి ఉంటుందని అంటున్నారు.      

More Telugu News