pork: ఆవు, పందిమాసం తినేవాడు పండిట్ ఎలా అవుతాడు?: నెహ్రూపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  • రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే అహూజా తీవ్ర వ్యాఖ్యలు
  • నెహ్రూ బీఫ్, పందిమాసం తినేవారన్న ఎమ్మెల్యే 
  • ఓట్ల కోసమే పేరు ముందు పండిట్ చేర్చారని వెల్లడి

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూపై రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఆవు మాంసం, పందిమాసం తినేవారనీ, ఆయన అసలు పండిటే కాదని విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు. రాజస్తాన్ లోని ఆళ్వార్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఆయన పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నెహ్రూ పండిట్ కాదు. ఆయన బీఫ్, పందిమాసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? కేవలం ఓట్లు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అన్న పదాన్ని చేర్చింది’ అని అహూజా విమర్శించారు. కాగా, అహూజా వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమనీ, లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని అహూజా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) విద్యార్థులే కారణమని కూడా అహూజా ఆరోపించారు. 

More Telugu News