oppo: అద్భుత ఫీచర్లతో 'ఒప్పో ఎఫ్9 ప్రో' వచ్చేస్తోంది!

  • ఈనెల 21న భారత మార్కెట్లోకి 
  • మూడు రంగులలో లభ్యం
  • ధర సుమారు రూ.23500గా ఉండవచ్చు

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ ఒప్పో నుండి నూతన స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఒప్పో కంపెనీ ఈనెల 21న ఇండియాలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి, అదే రోజున 'ఒప్పో ఎఫ్9 ప్రో' పేరిట కొత్త ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికత, వాటర్ డ్రాప్ స్క్రీన్ డిజైన్, డ్యూయల్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

వెనక భాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సహాయంతో సులభంగా మొబైల్ ని అన్ లాక్ చేసుకోవచ్చు. 6.3" డిస్‌ప్లేతో పాటు 1080×2280 రిజల్యూషన్, 19:9 అస్పెక్ట్ బాడీ రేషియో కలిగిన ఈ ఫోన్ 4జీబీ/64జీబీ, 6జీబీ/128జీబీ వేరియంట్ లలో లభ్యం కానుంది. సన్రైజ్ రెడ్, ట్వీలైట్ బ్లూ, స్టార్రి పర్పుల్ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.23500 ఉండే అవకాశం ఉంది.

ఇతర ఫీచర్లు:

  • హీలియో పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • వెనక భాగంలో 16/2 మెగాపిక్సెల్ కెమెరాలు
  • ముందు భాగంలో 25 మెగాపిక్సెల్ సేల్ఫీ కెమెరా
  • 3500ఎంఏహెచ్‌ బ్యాట‌రీ

More Telugu News