Gujarath: ముగ్గురిని పెళ్లి చేసుకున్నా విడాకులిచ్చారన్న మనస్తాపంతో ఆత్మహత్య!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • మూడు నెలల క్రితం ముచ్చటగా మూడో పెళ్లి
  • ఆమె కూడా వెళ్లిపోయిందని ఉరేసుకున్న జితేంద్ర

తాను ముగ్గురిని పెళ్లి చేసుకున్నా, అందరూ విడాకులు ఇచ్చి దూరమయ్యారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, జితేంద్ర పర్కార్ (34) అనే వ్యక్తి పాథాలజీ ల్యాబ్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఆ ఇద్దరూ అతనికి విడాకులు ఇచ్చి దూరమయ్యారు.

తాజాగా మూడు నెలల క్రితం మరో అమ్మాయిని జితేంద్ర వివాహం చేసుకోగా, ఆమె కూడా అతన్ని విడిచి వెళ్లింది. దీంతో తనకిక ఈ జీవితం అక్కర్లేదనుకున్న అతను, తాను పనిచేసే ల్యాబ్ లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News