Rajya Sabha: మాట మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్... రాజ్యసభ ఎన్నికలకు దూరం!

  • ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నాం
  • విపక్షాల అభ్యర్థికి ఓటేస్తామని మాట తప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్
  • న్యూఢిల్లీలో మీడియాతో విజయసాయిరెడ్డి

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ షాకిచ్చింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ప్రతిపక్షాల నుంచి వేరే పార్టీ అభ్యర్థికి ఛాన్స్ ఇస్తామని తొలుత చెప్పి, ఆపై తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దించిందని, ఆ విషయాన్ని ముందుగా తమతో చర్చింలేదని విజయసాయి ఆరోపించారు. రాష్ట్రంలో శత్రువుల మాదిరిగా ఉంటూ, కేంద్రంలో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని చేతులు కలిపి, కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి సైతం తాము మద్దతు ఇవ్వబోవడం లేదని తెలిపారు.

More Telugu News