mamata banerji: పళనిస్వామి అందుబాటులో లేకపోవడంతో మోదీకి ఫోన్ చేశా!: సీఎం మమతాబెనర్జీ

  • ‘మెరీనా’లో ఖననానికి అనుమతివ్వలేదని బాధ పడ్డా
  • ఈ విషయమై మాట్లాడేందుకు సీఎంకి నిన్న ఫోన్ చేశా
  • ఆ తర్వాత మోదీకి ఫోన్ చేశాను

కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో నిర్వహించేందుకు మొదట్లో తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. డీఎంకే నేతల న్యాయపోరాటం అనంతరం కరుణానిధిని ఖననం చేసే స్థలం విషయమై స్పష్టత వచ్చింది. ఈ విషయమై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, మెరీనా బీచ్ లో కరుణానిధి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిసి నిన్న తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ విషయమై మాట్లాడేందుకు తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేస్తే.. అందుబాటులో లేరని ఆయన సిబ్బంది చెప్పారని అన్నారు. దీంతో, ఈ విషయమై మాట్లాడేందుకు ప్రధాని మోదీకి కూడా నిన్న ఫోన్ చేసినట్టు మమత చెప్పారు.  

More Telugu News