nithin: ద్వారకా తిరుమల వెళ్లిన 'శ్రీనివాస కల్యాణం' టీమ్

  • సతీశ్ వేగేశ్నతో దిల్ రాజు మూవీ
  • కథాకథనాలే ప్రధాన బలం  
  • ఈ నెల 9వ తేదీన భారీ విడుదల

ఒక సినిమాను పూర్తి చేయడమంటే .. ఒక యజ్ఞాన్ని పూర్తిచేయడం లాంటిదే. అంత కష్టపడి పనిచేసిన చిత్రం విజయవంతం కావాలనే అంతా కోరుకుంటారు. సినిమా కథా కథనాలు ఏవైనా అది సక్సెస్ ను సాధించాలంటే భగవంతుడి అనుగ్రహం వుండాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయా సినిమాల విడుదలకి ముందు ఆ సినిమా సభ్యులు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు .. తమ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటూ వుంటారు. అలా తాజాగా 'శ్రీనివాస కళ్యాణం' టీమ్ ద్వారకా తిరుమలేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించింది. దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా .. నందిత శ్వేత ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో  దర్శకనిర్మాతలు వున్నారు.   

More Telugu News