karunanidhi: కరుణానిధి, రజనీకాంత్ ల మధ్య పేలిన పంచ్ లు!

  • కరుణ, రజనీలు మంచి సన్నిహితులు
  • ఒకరిపై మరొకరు పంచ్ లు కూడా వేసుకునేంత అనుబంధం
  • కరుణ మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన రజనీ

దివంగత కరుణానిధితో సూపర్ స్టార్ రజనీకాంత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధంతోనే ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకునేవి. ఓ సందర్భంలో కరుణ, రజనీలు ఒక సినిమా కార్యక్రమానికి సంబంధించి ఒకే వేదికపై కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముందుగా రజనీకాంత్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులంటే నిప్పులాంటివారని... వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే, వారి నిప్పుల సెగ మనకు తగలకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటూ కరుణకు పంచ్ వేశారు. ఆ తర్వాత మాట్లాడిన కరుణానిధి... రజనీకి కౌంటర్ పంచ్ ఇచ్చారు. 'తమ్ముడూ రజనీ... నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటివాడిని. ప్రజాసేవలో ప్రజల కాలి చెప్పులాంటివాడిని' అంటూ పంచ్ వేశారు. ఈ నేపథ్యంలో, ఆ సభ చప్పట్లతో మారుమోగిపోయింది.

తాజాగా, కరుణ మరణం పట్ల రజనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఇదొక బ్లాక్ డే అంటూ ఆవేదన వ్యక్తం చేవారు. 

More Telugu News