manmohan singh: జైపాల్ రెడ్డి ‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకావిష్కరణ

  • ఆవిష్కరించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
  • ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం
  • పలుపార్టీల నేతలు హాజరు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్, టీడీపీ తో పాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ పుస్తకంలో ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం, ప్రభావితం చేసిన సందర్భాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ, కమ్యూనిజం నుంచి సోషలిజం వరకూ భావజాలాన్ని సంక్షిప్తంగా పొందుపరిచానని చెప్పారు.
  

More Telugu News