karunanidhi: ఇది బ్లాక్ డే.. మరచిపోలేను!: రజనీకాంత్

  • ఈ బ్లాక్ డేను నేను ఎప్పుడూ మర్చిపోలేను
  • కరుణ ఆత్మకు శాంతి చేకూరాలి: రజనీకాంత్
  • అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం: ఖుష్బూ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’ గా ఆయన అభివర్ణించారు. ఈ  బ్లాక్ డేను తాను ఎప్పుడూ మర్చిపోలేనని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

ఇంకా, కరుణానిధితో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని ప్రముఖ నటి రాధిక అన్నారు. ఓ గొప్ప నాయకుడు మనల్ని వదిలి వెళ్లిపోయారని, ఆయనకు కన్నీటి వీడ్కోలు చెబుతున్నానని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు.

మరోనటి  హన్సిక స్పందిస్తూ, కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళ ప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ స్పందిస్తూ, నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని తన ట్వీట్ లో చెప్పింది. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేసింది. 

More Telugu News