robo: 'రోబో' కథ నాదే: కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన దర్శకుడు శంకర్

  • రజనీ, ఐశ్వర్య జంటగా 'యందిరన్'ను తెరకెక్కించిన శంకర్
  • ఆ కథ నాదేనంటూ తమిళనాథన్ అనే రచయిత కేసు
  • కౌంటర్ పిటిషన్ వేసిన శంకర్

రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా సూపర్ హిట్ మూవీ 'యందిరన్'ను ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఆ చిత్రం బద్దలుకొట్టింది. 2010లో విడుదలైన ఈ సినిమా తెలుగులో 'రోబో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, 'యందిరన్' కథ తనదేనంటూ తమిళనాథన్ అనే దర్శకుడు కోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో, శంకర్ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో, ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కథ తనదేనని... తమిళనాథన్ చెబుతున్న కథకు, తన సినిమాకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. 

More Telugu News