gvl narasimha rao: జీవీఎల్ ఒక సన్నాసి.. రాష్ట్రానికి శనీశ్వరుడిగా తయారయ్యాడు: కుటుంబరావు

  • దమ్ముంటే ఏపీ నుంచి వార్డు మెంబర్ గా గెలువు
  • పీడీ ఖాతా అంటే ఏమిటో కూడా తెలియదా?
  • నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆధారాలుంటే కోర్టుకు వెళ్లు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఏపీ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ కుటుంబరావు విమర్శలు గుప్పించారు. జీవీఎల్ ని ఆంధ్రుడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లడం కాదని... దమ్ముంటే ఏపీ నుంచి ఒక వార్డు మెంబర్ గా గెలవాలని సవాల్ విసిరారు. జీవీఎల్ ఒక సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఒక శనీశ్వరుడిలా తయారయ్యాడని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడికి పీడీ ఖాతా అంటే ఏమిటో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. పీడీ ఖాతాల పేరుతో టీడీపీ కార్యకర్తలకు డబ్బులు వేశారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే అనుమానాలు ఉంటే... ప్రభుత్వ ఖాతాలు సరిగా లేవని సీబీసీకి ఫిర్యాదు చేయవచ్చు కదా? అంటూ కుటుంబరావు దెప్పి పొడిచారు. 'దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లు' అంటూ హితవు పలికారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన రూ. 29వేల కోట్ల అవినీతి గురించి జీవీఎల్ ఏం చెబుతారని ఎద్దేవా చేశారు.

More Telugu News