Karnataka: 'నా భార్యంటే, నా భార్యంటూ' యువతి కోసం రోడ్డుపై రచ్చ... వీడియో చూడండి!

  • కర్ణాటకలో ఘటన
  • విడాకులు పొందిన మహిళను చేసుకునేందుకు ఇద్దరి యత్నం
  • రోడ్డుపై వాగ్వాదం, పిడిగుద్దులు

ఓ మహిళ తన భార్యంటే, తన భార్యని ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై నానాయాగీ చేసిన ఘటన కర్ణాటకలోని నెలమంగల తాలూకా బివికెరె వద్ద నిన్న సాయంత్రం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చిక్కబిదరకల్లు ప్రాంతానికి చెందిన మూర్తి, సిద్ధు అనే వ్యక్తులు, ఓ మహిళ కోసం వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమెను చెరో చెయ్యి పట్టుకుని లాగారు.

చుట్టూ చూస్తున్న వారు వారిని విడిపించే ప్రయత్నం చేయకపోగా, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్తను కన్నడ టీవీ చానళ్లు వైరల్ చేశాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సదరు మహిళ, తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోందట. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న ఈ ఇద్దరూ ఇలా గొడవకు దిగారట. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాజీ కుదుర్చుకోకుంటే కేసులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారట.

More Telugu News