vijay devarakonda: సెన్సార్ పూర్తి .. ఆగస్టు 15న 'గీత గోవిందం'

  • విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్నాం 
  • ఆయన అభిమానులు ఆశించే అంశాలపై శ్రద్ధ పెట్టాం 
  • అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న దర్శకుడు    

విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. "రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాము. అల్లు అరవింద్ ఆశీస్సులతో .. బన్నీ వాసు సహకారంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేశాము. విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన సినిమా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఈ సినిమాను రూపొందించాము. గోపీసుందర్ అందించిన సంగీతానికి లభించిన ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.    

More Telugu News