Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన బాలక‌ృష్ణ, దర్శకుడు క్రిష్

  • ‘యన్.టి.ఆర్’ బయోపిక్ విషయమై చర్చ
  • ఎన్టీఆర్ స్నేహితులను పిలిపించి మాట్లాడిన బాలకృష్ణ
  •  నిమ్మకూరు, కొమరవోలు వెళ్లనున్న బాలకృష్ణ, క్రిష్

ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ నటుడు బాలక‌ృష్ణ, దర్శకుడు క్రిష్ కలిశారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ విషయమై చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన తండ్రి ఎన్టీఆర్ స్నేహితులను పిలిపించి బాలకృష్ణ మాట్లాడినట్టు సమాచారం. రేపు, నిమ్మకూరు, కొమరవోలులో బాలకృష్ణ, క్రిష్ లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిన్నప్పటి నివాసాన్ని బాలకృష్ణ పరిశీలిస్తారని సమాచారం. కొమరవోలు వెళ్లి తన తల్లి బసవతారకం బంధువులతో బాలకృష్ణ మాట్లాడతారని తెలుస్తోంది. కాగా, బాలక‌ృష్ణ, క్రిష్ తో పాటు నటుడు రానా కూడా చంద్రబాబును కలిశారు.

More Telugu News