ajith: అజిత్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు .. నిర్మాతగా బోనీ కపూర్!

  • అజిత్ తాజా చిత్రంగా 'విశ్వాసం'
  • చిత్రీకరణ పరంగా ముగింపు దశ
  • నెక్స్ట్ మూవీ డైరెక్టర్ వినోద్  

తమిళ స్టార్ హీరోగా అజిత్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన 'విశ్వాసం ' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ప్రాజెక్టు ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఆయన తన నెక్స్ట్ మూవీని బోనీ కపూర్ నిర్మాణంలో చేయనున్నాడనేది తాజా సమాచారం.

శ్రీదేవి ఫ్యామిలీతో అజిత్ కి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ కారణంగానే ' ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ చేశాడు. తమ బ్యానర్లో హీరోగా ఒక సినిమా చేయమని శ్రీదేవి .. బోనీ కపూర్ ఆ సమయంలోనే అజిత్ ను అడిగారట. అందుకు సరేనని అప్పుడు చెప్పిన అజిత్ .. ఇప్పుడు బోనీ కపూర్ బ్యానర్లో చేయడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇంతకుముందు కార్తీ హీరోగా 'ఖాకీ' సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా తన సత్తాచాటుకున్న వినోద్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.    

More Telugu News