Hyderabad: హైదరాబాద్‌లో టీచర్‌పై యాసిడ్ దాడి.. ముఖానికి తీవ్ర గాయాలు

  • ఇంటి కొచ్చి పిలిచి మరీ యాసిడ్ చల్లిన నిందితుడు
  • తీవ్ర గాయాలపాలైన ఉపాధ్యాయురాలు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లోని చింతల్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన  ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉప్పులూరి సూర్యకుమారి (48)- లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు. సూర్యకుమారి స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.  

గత రాత్రి 7:30 గంటల సమయంలో సూర్యకుమారి ఇంటికి వచ్చిన ఆగంతకుడు సూర్యకుమారిని పిలిచాడు. మరో మహిళ రావడంతో సూర్యకుమారి కావాలని చెప్పడంతో ఆమె లోపలికి వెళ్లి బాధితురాలిని పంపింది. ఆమె బయటకు వచ్చిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆగంతకుడు ఆమె ముఖంపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ముఖానికి మాస్క్ ధరించడంతో అతడిని గుర్తుపట్టలేకపోయామని సూర్యకుమారి కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News