East Godavari District: పూజలందుకున్న ‘దుర్గాడ పాము’ మృతి!

  • కొన్ని రోజులుగా ఎటూ కదలకుండా ఉన్న నాగుపాము
  • ఈరోజు మ‌ృతి..కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు
  • గుడి కట్టించి తీరుతామంటున్న భక్తులు

తూర్పు గోదావరి జిల్లా దుర్గాడ శివార్లలో సుమారు నాలుగు వారాలుగా ఎటూ కదలకుండా ఉండి, ప్రజల పూజలు అందుకున్న నాగుపాము మృతి చెందింది. ఆ పామును సుబ్రహ్మణ్య స్వామిగా భావించిన అక్కడి ప్రజలు ఈ వార్త విని తట్టుకోలేకపోయారు.. కన్నీరుమున్నీరయ్యారు. నాగుపాము మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అక్కడికి తరలివెళ్లారు. కాగా, సుమారు నాలుగు వారాలుగా పూజలందుకున్న ఈ పాముకు గుడి కట్టించేందుకు భక్తులు నిర్ణయించారు. శ్రావణ మాసంలోగా గుడి కట్టిస్తామని చెబుతున్నారు.  

More Telugu News