kukatpally: కూకట్ పల్లిలో విషాదం.. స్కూల్ లో షెడ్ కూలి ఇద్దరు విద్యార్థుల మృతి!

  • న్యూసెంచరీ పాఠశాలలో కూలిన షెడ్ 
  • కరాటే క్లాస్ జరుగుతుండగా కుప్పకూలిన షెడ్
  • ఇద్దరు మ‌ృతి.. పలువురికి గాయాలు

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. న్యూసెంచరీ పాఠశాలలోని ఓ షెడ్ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాఠశాల ఆవరణలోని రేకుల షెడ్ లో కరాటే క్లాస్ లు నిర్వహిస్తుంటారు.

కరాటే క్లాస్ నిమిత్తం విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్లారు. అంతలోనే ఒక్కసారిగా రేకుల షెడ్ కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా, పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత రేకుల షెడ్డులో కరాటే క్లాస్ లు నిర్వహించడం వల్లే ఈ సంఘటన జరిగిందని అంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News