chaitu: మారుతిపై నమ్మకంతోనే కథ వినలేదు: నాగార్జున

  • 'సవ్యసాచి' కథ విన్నాను 
  • త్వరలో 'శైలజా రెడ్డి అల్లుడు' చూస్తాను 
  • రెండు సినిమాలపై నమ్మకం వుంది  

నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన 'చి ల సౌ ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున పాల్గొన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చైతూ సినిమాల గురించి ప్రస్తావించారు. చైతూ హీరోగా చేస్తోన్న 'సవ్యసాచి' కథను నేను విన్నాను .. ఆ సినిమా షూటింగు ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది .. అప్పుడు చూస్తాను" అన్నారు.

ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' కథను నేను వినలేదు. ఎందుకంటే మారుతి సిద్ధం చేసుకునే కథలపైనా .. ఆడియన్స్ పల్స్ పట్టుకునే ఆయన నేర్పు పైన నాకు నమ్మకం వుంది. అందువల్లనే 'శైలజా రెడ్డి అల్లుడు' కథ వినలేదు .. మరో పది రోజుల్లో ఆ సినిమా చూస్తాను. ఈ రెండు సినిమాలు కూడా చైతూ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోతాయనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   

More Telugu News