gopichand: సక్సెస్ కోసం రూటు మార్చుతోన్న గోపీచంద్

  • వరుస పరాజయాలు 
  • సక్సెస్ కోసం వెయిటింగ్ 
  • థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్

మొదటి నుంచి కూడా గోపీచంద్ యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కూడా చాలా అవసరమని భావించిన ఆయన, యాక్షన్ కి ఎమోషన్ ను కూడా జత చేశాడు. అలా గోపీచంద్ మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు.

అయితే కొంతకాలంగా ఈ తరహా సినిమాలు చేసినా ఆయనకి సరైన హిట్ పడటం లేదు. వరుస పరాజయాలు ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రూట్ మార్చి కొత్తదనం చూపించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. అందులో భాగంగానే ఆయన థ్రిల్లర్ మూవీ చేయడానికి అంగీకరించాడు. నూతన దర్శకుడు కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి .. నవంబర్ లో సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.    

More Telugu News