Ongole: ఇద్దరు బిడ్డలున్న 30 ఏళ్ల మహిళ 16 ఏళ్ల యువకుడితో వెళ్లిపోయింది!

  • పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్న మహిళ, బాధిత కుటుంబం
  • భర్తతో గొడవపడి బాలుడితో పరారైన మహిళ
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు

భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసిన 30 సంవత్సరాల మహిళ, 16 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఒంగోలులో జరిగింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, భార్యాభర్తలు, వారి ఇద్దరి పిల్లలు నివసిస్తున్న ఇంటి పక్కనే బాధిత బాలుడి కుటుంబం నివసిస్తోంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలుడికి, సదరు మహిళకు మధ్య పరిచయం ఏర్పడింది.

నాలుగు రోజుల క్రితం భార్యా భర్తల మధ్య వివాదం ఏర్పడగా, తాను వెళ్లిపోతున్నానని చెప్పి ఆమె ఇల్లొదిలింది. అదే రోజు నుంచి బాలుడు కూడా కనిపించ లేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. బాలుడు అదృశ్యమయ్యాడని కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వీరిద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

More Telugu News