Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ తో పూజా హెగ్డే ఫొటో షూట్!
  • 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ అప్ డేట్స్ 
  • నాగశౌర్య 'నర్తనశాల' విడుదల తేదీ 
  • మెగా హీరో 'చిత్రలహరి' కబుర్లు  


*  ప్రస్తుతం 'సాహో' చిత్రం చేస్తున్న ప్రభాస్, ఆ తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఈ జంటపై తాజాగా ఫొటో షూట్ నిర్వహించినట్టు సమాచారం.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 13 నుంచి తిరిగి హైదరాబాదులో జరుగుతుంది. గత షెడ్యూల్ లో ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి విదితమే. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తోంది.  
*  నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన 'నర్తనశాల' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. యామినీ భాస్కర్, కశ్మీరా పరదేశి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  సాయిధరం తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగును వచ్చే నెల రెండో వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే ఈ చిత్రానికి 'చిత్రలహరి' అనే టైటిల్ ను, 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.

More Telugu News