modi: అవిశ్వాసం నెగ్గినందుకు భారీ వేడుక.. లడ్డూలు, పూలదండలతో మోదీకి అభినందనలు!

  • జూలై 20న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం
  • 325 ఓట్లతో అవిశ్వాసంపై గెలుపొందిన కేంద్రం
  • మోదీకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ ఎంపీలు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎంపీలు వేడుక జరుపుకున్నారు. ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లడ్డూ తినిపించి, పూలమాలతో సత్కరించారు.

జూలై 20న లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై 12 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడ్డాయి. దీంతో, అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలోనే, ఈరోజు బీజేపీ ఎంపీలు అభినందన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు అద్వాణీ కూడా హాజరయ్యారు.

More Telugu News