Gangooly: గంగూలీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం... ధోనీని హీరోను చేసింది!

  • వైజాగ్ లో తన కెరీర్ ఇన్నింగ్స్ ను ఆడిన ధోనీ
  • అంతకుముందు మ్యాచ్ లలో 7వ స్థానంలో
  • వన్ డౌన్ లో పంపాలని నిర్ణయించిన గంగూలీ

భారత క్రికెట్ కెప్టెన్ గా, అత్యుత్తమ వికెట్ కీపర్ గా రాణించి, ప్రస్తుతం టెస్టులకు గుడ్ బై చెప్పి, చిన్న ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని టీమ్ ఇండియాలో సుస్థిరం చేసింది ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనడంలో సందేహం లేదు. ధోనీ కెరీర్ లో వైజాగ్‌ వన్డే ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆ వన్డేలో వన్ డౌన్ లో మైదానంలోకి వచ్చిన ధోని పాకిస్థాన్‌ పై సునామీలా విరుచుకుపడి, 15 ఫోర్లు, 4 సిక్సులతో 148 పరుగులు చేశాడు.

ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ధోనీ పేరు దేశమంతా మారుమోగి పోగా, ఇకతను వెనుదిరిగి చూడలేదు. అంతకుముందు ఆడిన రెండు వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోనీని, ఈ వన్డేలో మూడో స్థానంలో దింపాలన్న నిర్ణయం గంగూలీదేనట. ఈ సంగతిని గంగూలీ స్వయంగా చెప్పాడు. 'వైజాగ్‌ లో మ్యాచ్‌ కి ముందు కూడా ధోనీ 7వ స్థానంలోనే ఆడాలని నిర్ణయించామని, మ్యాచ్ మొదలైన తరువాత, అతనిలో సత్తా ఉందని గ్రహించి, డ్రెస్సింగ్‌ రూమ్‌ లోని ధోని వద్దకెళ్లి, మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ధోనీ, "నీ సంగతేంటి?" అని ప్రశ్నించాడని, తాను నాలుగో స్థానంలో వస్తానని చెప్పానని గంగూలీ అన్నాడు. నాటి గంగూలీ నిర్ణయం భారత క్రికెట్ కు ఎంతటి తురుపుముక్కను అందించిందో వేరే చెప్పనవసరం లేదు.

More Telugu News