Shradda Kapoor: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సాహో' కోసం రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణ
  • 'వెంకీ మామ'కు తమన్ సంగీతం 
  • 'గూఢచారి' హక్కులు తీసుకున్న ప్రముఖ నిర్మాత  

*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో' తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ షూటింగులో తాజాగా జాయిన్ అయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామ' పేరిట ఓ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి విదితమే. వచ్చే నెల 8 నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకునే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  అడవి శేష్, శోభిత ధూళిపాళ జంటగా నటించిన 'గూఢచారి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా, ఈ చిత్రం రెండు రాష్ట్రాల ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర 4  కోట్లకు తీసుకున్నట్టు తాజా సమాచారం. తక్కువ బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం హిందీ హక్కులు ఇప్పటికే 2 కోట్లకు అమ్ముడుపోయాయి.

More Telugu News