kapu reservations: ఏపీలో వచ్చేది హంగ్ అసెంబ్లీనే.. కాంగ్రెస్సే కింగ్ మేకర్!: ఊమెన్ చాందీ

  • వైసీపీ, టీడీపీలు కాపులను మోసం చేశాయి
  • ఏపీకి ప్రత్యేకహోదా ‘కాంగ్రెస్’ వల్లే సాధ్యం
  • కాపులకు రిజర్వేషన్లపై ‘కాంగ్రెస్’ కట్టుబడి ఉంది

ఏపీలో వచ్చేది హంగ్ అసెంబ్లీనే అని, కాంగ్రెస్సే కింగ్ మేకర్ గా మారనుందని
ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఊమెన్ చాందీ జోస్యం చెప్పారు. మిగతా కులాలకు ఇబ్బంది లేకుండా, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని వైసీపీ అధినేత జగన్ తేల్చేశారని, వైసీపీ, టీడీపీలు కాపులను మోసం చేశాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని చెప్పారు.

More Telugu News