mohan babu: యూఎస్ కాన్సుల్ జనరల్ విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన మోహన్‌బాబు!

  • విద్యానికేతన్ లోని మా పిల్లలు కూడా పాల్గొన్నారు
  • ప్రతిఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలి
  • మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం కావాలి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకమని చెబుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డాకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆ సవాల్ ని స్వీకరించిన కేథరిన్ దానిని పూర్తిచేసి, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఈ ఛాలెంజ్ విసిరారు.

తాజాగా ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసిన మోహన్ బాబు ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘ఇదిగో.. ఛాలెంజ్ పూర్తి చేశాను. విద్యానికేతన్ లోని మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని కోరుతున్నా. మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం కావాలి. మీరు మొక్కలు నాటుతున్న ఫొటోలను నాకు పంపండి’ అని మోహన్ బాబు పేర్కొన్నారు. 

More Telugu News