Biggboss: బిగ్ బాస్-2... రీఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామల!

  • నూతన్ నాయుడికి అత్యధిక ఓట్లు
  • స్వల్ప తేడాతో నిలిచిన శ్యామల
  • ఇద్దరికీ హౌస్ లో రీ ఎంట్రీకి అవకాశం ఇచ్చిన నాని 

తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-2లో అందరూ అనుకున్నట్టుగానే నూతన్ నాయుడు, శ్యామల రీఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ముందే లీకైపోయిన సంగతి తెలిసిందే. సామాన్యుడి కోటాలో హౌస్ లోకి వెళ్లిన నూతన్ నాయుడు, రెండు వారాల తరువాత బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, హౌస్ లోకి రీ ఎంట్రీ ప్రకటించిన తరువాత గత వారం రోజులుగా ఓట్ల కోసం ప్రచారం జరిగింది. బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ రాని విధంగా ఓట్ల వర్షం కురిసింది. నూతన్ నాయుడికి శ్యామల కన్నా కాసిన్ని ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఈ ఇద్దరూ హౌస్ లోనికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హోస్ట్ నాని ప్రకటించాడు.

ఇక వీరిద్దరి రీ ఎంట్రీ ఎపిసోడ్ ను శనివారం నాడే షూట్ చేయడంతో, ఆ షోలో ప్రేక్షకులుగా కూర్చున్న వారు బయటకు వచ్చి లీకులిచ్చేశారు. తాను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్ కాలేదని, హౌస్ మేట్స్ తనను ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని శ్యామల అభిమానుల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ఇదే సమయంలో కౌశల్ ఆర్మీ నూతన్ నాయుడికి మద్దతు పలికింది. ఈ కారణాలతోనే మిగతా వారితో పోలిస్తే వీరిద్దరికీ అధికంగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

ఇదిలావుండగా, హోస్ట్ నాని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్ కు మద్దతుగా నాని వ్యవహరిస్తున్నాడని, హౌస్ లో గొడవలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

More Telugu News