roja: బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • నగరిలో వైయస్సార్ క్రికెట్ టోర్నీ
  • పాల్గొంటున్న 190 టీములు
  • క్రికెట్ ఆడి అలరించిన రోజా

నిరంతరం రాజకీయాలతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా క్రికెట్ ఆడారు. బౌలింగ్ చేయడమే కాక, బ్యాంటింగ్ తోనూ ఆకట్టుకున్నారు. నగరిలో వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, వైయస్సార్ స్ఫూర్తితో యువత తమ క్రీడానైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారని, వారి ట్యాలెంట్ ను చూపించుకోవడానికి ఈ టోర్నీ ఒక మంచి అవకాశమని చెప్పారు. ఈ టోర్నీలో పాల్గొనడానికి 190 టీములు రావడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోందని తెలిపారు.

పార్టీలు, కులాలకు అతీతంగా ఈ టోర్నీ జరుగుతోందని రోజా చెప్పారు. టోర్నీ విజేతలకు ప్రైజులే కాకుండా, టోర్నీలో పాల్గొన్న ప్రతి టీమ్ కూ క్రికెట్ కిట్ ఇస్తున్నామని... ఇందులో రెండు బ్యాట్లు, నాలుగు ప్యాడ్లు, స్టంప్స్ , గ్లోవ్స్ ఉంటాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

More Telugu News