prabhas: 'సాహో' విడుదలకి 'బాహుబలి 2' సెంటిమెంట్!

  • 'సాహో' కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు
  • పెద్ద సంఖ్యలో బాలీవుడ్ నటీనటులు 
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా  

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. గూఢచారిగా ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.

తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను, ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రభాస్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోయిన 'బాహుబలి 2' .. 2017 ఏప్రిల్ 28వ తేదీన విడుదలైంది. ఆ సెంటిమెంట్ తో 'సాహో'ను కూడా అదే రోజున .. అంటే 2019 ఏప్రిల్ 28న రిలీజ్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తుండటం విశేషం.         

More Telugu News