vijay devarakonda: విజయ్ దేవరకొండ పాడిన పాటలో మార్పులు చేస్తున్నాం: గేయ రచయిత శ్రీమణి

  • 'గీత గోవిందం' నుంచి వచ్చిన పాట
  • సీత .. సావిత్రిల ప్రస్తావన  
  • అందుకు సంబంధించిన పదాల పట్ల అభ్యంతరం

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' చిత్రం రూపొందింది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ పాడిన పాటను రిలీజ్ చేశారు. సాహిత్యం పరంగా ఈ పాట పట్ల చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాటలో సీత .. సావిత్రిల ప్రస్తావన తీసుకురావడం విమర్శలకు దారితీసింది.

దాంతో వివాదం మరింత ముదరకూడదనే ఉద్దేశంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ విషయంపై తాజాగా గీత రచయిత శ్రీమణి స్పందించాడు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. అందరి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత మాపై వుంది. అందువలన అభ్యంతరానికి కారణమైన పదాలను మారుస్తున్నాము .. ఆ తరువాతే పాటను మళ్లీ యూట్యూబ్ లో విడుదల చేస్తాం" అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.      

More Telugu News