Andhra Pradesh: ఏపీకి హోదా పేరు లేకపోతేనేం.. ఆ ప్రయోజనాలు అందుతున్నాయిగా!: జీవీఎల్

  • హోదా లేకున్నా అన్నీ ఇస్తున్నాం
  • నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
  • పారదర్శకత విషయంలో ఏపీ భయపడుతోంది

ఆంధ్రప్రదేశ్‌కు హోదా అన్న పేరొక్కటే లేదని, కానీ హోదాతో దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి దక్కుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీకి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే, స్పెషల్ పర్పస్‌ వెహికల్ ఏర్పాటుకు ఆ రాష్ట్రమే ముందుకు రావడం లేదని ఆరోపించారు. అందుకు ముందుకొస్తే నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత ఉంటుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. రాయితీలు ఏ రాష్ట్రానికీ లేవని, నిజానికి రాయితీలకు, హోదాకు సంబంధం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీకి ఐదేళ్ల రెవెన్యూ లోటు భర్తీకి గాను గ్రాంట్‌గా రూ.22,112 కోట్లను కేంద్రం ఇస్తున్నట్టు తెలిపారు.

More Telugu News