nithin: అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తోన్న దిల్ రాజు

  • దిల్ రాజు నుంచి మరో కుటుంబ కథా చిత్రం 
  • నితిన్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • ఆగస్టు 9వ తేదీన భారీస్థాయి విడుదల

కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలు ఆయనకి విజయాలను అందించాయి. 'బొమ్మరిల్లు' .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' .. 'శతమానం భవతి' సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'శతమానం భవతి' సినిమా విడుదలకి ఒక వారం రోజుల ముందుగా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి కోసం దిల్ రాజు ఒక స్పెషల్ షో వేశారు. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి చూసేలా ఆయన ఏర్పాటు చేశారు. ఆ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. 'శ్రీనివాస కళ్యాణం' విషయంలోను ఆయన అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట. నితిన్ .. రాశి ఖన్నా జంటగా ఆయన 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరి కుటుంబ సభ్యుల కోసం స్పెషల్ షో వేయించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. సెంటిమెంట్ సంగతి అటుంచితే .. ఇదొక మంచి ఆనవాయితి అనిపిస్తోంది కదూ.     

More Telugu News