sensex: రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్

  • 36,825 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 50 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 20 శాతం లాభపడ్డ టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటో షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 107 పాయింట్లు పెరిగి 36,825కి ఎగబాకింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11,134కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ (20.00%), టీటాఘర్ వాగన్స్ (19.96%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ (17.61%), గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మాస్యూటికల్స్ (13.91%), సుజ్లాన్ ఎనర్జీ (12.90%).
 
టాప్ లూజర్స్:
ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (-2.69%), గ్రాన్యూల్స్ ఇండియా (-2.65%), ఇమామీ (-2.64%), పీసీ జువెలర్స్ (-2.19%), హీరో మోటోకార్ప్ (-1.97%).      

More Telugu News