mob attacks: మూకదాడులపై స్పందించిన కేంద్రం.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు!

  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
  • నాలుగు వారాల్లో ఓ నివేదిక సమర్పించాలని ఆదేశాలు
  • కమిటీ  సిఫారసుల పరిశీలనకు మంత్రుల బృందం

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మూకదాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మూకదాడులపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. నాలుగు వారాల్లో ఓ నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ ఇచ్చే సిఫారసుల పరిశీలనకు హోం మంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటు చేయనున్నారు. కమిటీ సిఫారసులను మంత్రుల బృందం పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీకి సమర్పించనుంది.  

More Telugu News