purandeswari: కాంగ్రెస్ తో అంటకాగింది మీరు కాదా?: పురందేశ్వరికి బుద్ధా వెంకన్న లేఖ

  • పురందేశ్వరి వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
  • ‘కాంగ్రెస్’తో టీడీపీ కుమ్మక్కైందనడం సబబు కాదు
  • ఏపీకి ద్రోహం చేస్తున్న బీజేపీకి వత్తాసు పలుకుతోంది మీరు కాదా? 

బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా ఓ బహిరంగ లేఖ రాశారు. టీడీపీపై పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుమ్మక్కైందని మాట్లాడటం సబబు కాదని పురందేశ్వరికి హితవు పలికారు. సభా నిబంధనల ప్రకారమే అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిందని, ఏపీకి ద్రోహం చేస్తున్న బీజేపీకి వత్తాసు పలుకుతోంది మీరు కాదా? గతంలో కాంగ్రెస్ తో అంటకాగింది మీరు కాదా? అని ఆయన తన లేఖలో ప్రశ్నించారు.

More Telugu News