yadadri: యాదాద్రికి ఐఎస్వో స‌ర్టిఫికెట్ రావ‌డం హర్షణీయం: టీ-మ‌ంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • అద్భుత క‌ళాసంప‌ద‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వమిది
  • ఆధ్యాత్మిక రాజ‌ధాని యాదాద్రి కీర్తి మ‌రింత పెరిగింది
  • ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలవాలి

ఆధ్యాత్మిక రాజ‌ధాని యాదాద్రికి ఐఎస్వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) స‌ర్టిఫికెట్ రావ‌డం అద్భుత క‌ళా సంప‌ద‌కు ద‌క్కిన అరుదైన‌ గౌర‌వమ‌ని తెలంగాణ గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయ నిర్మాణంపై ప్రత్యేక‌ దృష్టి, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ, ఆయ‌న ప్రోత్సాహం వ‌ల్లే యాదాద్రికి ఈ గౌరవం ల‌భించిందని, ఈ సందర్భంగా కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

వైటీడిఏ అధికారులు, స్థ‌ప‌తులు, అర్కిటెక్ట్ లు, శిల్ప క‌ళాకారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని అన్నారు. యాదాద్రికి నిర్మాణ దశలో ఉండగానే ఐఎస్వో స‌ర్టిఫికెట్ ద‌క్క‌డం గొప్ప విషయమని అన్నారు. ప్రాచీన శిల్పకళా సౌందర్యం.. కృష్ణ శిలల నిర్మాణాలు, ఎత్తైన గోపురాలు, అద్భుత కళాసంపద, తంజావూరు శిల్ప నిర్మాణ రీతి, ప్రాకారాల సౌందర్య ప్రగతి, శిల్పుల కళాసృష్టితో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి  ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుంద‌ని ఆకాంక్షించారు.

More Telugu News