Chandrababu: కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

  • కేంద్ర నిధులు తన సొంత నిధులుగా బాబు ప్రచారం
  • ఏపీలో జన్మభూమి బ్రోకర్ల పాలన నడుస్తోంది
  • తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ‘అవిశ్వాసం’ పెట్టారు

కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర నిధులను చంద్రబాబు తన సొంత నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని, తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బాబు అవిశ్వాసం పెట్టారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎప్పుడూ అడగలేదని, బాబు కోరిక మేరకే ప్రత్యేక ప్యాకేజ్ ని కేంద్రం ఇచ్చిందని, ఏపీలో జన్మభూమి బ్రోకర్ల పాలన నడుస్తోందని ఆరోపించారు.  

More Telugu News