Kulgam: కానిస్టేబుల్ సలీమ్ అహ్మద్ ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల ఎన్ కౌంటర్!

  • కశ్మీర్లోని కుల్గాంలో ఎన్ కౌంటర్
  • ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
  • కానిస్టేబుల్ ను చంపిన ప్రాంతానికి దగ్గరలోనే ఎన్ కౌంటర్ 

కానిస్టేబుల్ సలీమ్ అహ్మద్ షాను కిడ్నాప్ చేసి, దారుణాతి దారుణంగా హింసించి చంపిన ఉగ్రవాదులను ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కుల్గామ్ లో సలీమ్ అహ్మద్ ను హత్య చేసిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మృతుల్లో సలీమ్ ను హత్య చేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని సైనికాధికారులు స్పష్టం చేశారు.

 మొహల్లా ప్రాంతంలోని ఖుద్వనిలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఈ ఎన్ కౌంటర్ చేశాయి. కేంద్ర రిజర్వ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

More Telugu News